చర్చ్‌లో కాల్పులు.. ఇద్దరు మహిళలు మృతి

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రం లెక్సింగ్టన్‌ పట్టణంలోని రిచ్మండ్ రోడ్ బాప్టిస్ట్ చర్చ్‌లో కాల్పులు జరిగాయి. దుండగుడు చర్చ్‌లో ఇద్దరు మహిళలను కాల్చి చంపగా, ఇద్దరు పురుషులు గాయపడ్డారు. అనంతరం ఘటనాస్థలానికి కొద్దిదూరంలో బ్లూ గ్రాస్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ ట్రాఫిక్ స్టాప్‌లో పోలీసులపై కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని ఎదురుదాడిలో హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్