టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న AA23 ప్రాజెక్ట్లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇటీవల 'స్త్రీ 2'తో విజయం సాధించిన శ్రద్ధా, గతంలో 'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. లోకేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఉన్నా, ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర కీలకంగా ఉంటుందని టాక్.