యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు కాసేపటిలో భూమికి చేరనున్నారు. కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ అయిన వెంటనే వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.