పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ తాము ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయామని, ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఆఖరి ఓవర్లలో తడబడటం ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు. ఈ పిచ్పై 210-220 పరుగులు చేయగల సామర్థ్యం ఉన్నా, తాము 162 పరుగులకే పరిమితమయ్యామని, మిగిలిన బ్యాటర్లు భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారని గిల్ వాపోయారు.