పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. కాబోయే భార్య సియా గోయల్ తరఫున వాదించేందుకు ఇద్దరు న్యాయవాదుల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో, సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్పై న్యాయవాది అశుతోశ్ శ్రీవాస్తవ రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే అశుతోశ్ శ్రీవాస్తవ తనను లాయర్గా నియమించుకున్నారని సియా సంతకం చేశారని చెప్పగా, సాహిల్ గోయల్ దీనిని ఖండించారు. తమ కుటుంబం విపుల్ దుసింగ్ను సంప్రదించిందని, అశుతోశ్ మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.