దుబ్బాక: దేశ సర్వతోముఖాభివృద్ధికి జనగణన కీలకం: ఎంపీ

దేశ సర్వతోముఖాభివృద్ధికి జనగణన కీలకమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి-అక్బర్పేట మండలం బొప్పాపూర్లో స్వీయగణనలో తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్న ఆయన, జనగణన, కులగణనలో ప్రజలు భాగస్వాములు కావాలని, కచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజల నుంచి సేకరించే సమాచారం దేశ భవిష్యత్ తో పాటు ప్రధాని నరేంద్రమోదీ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్