సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి బదిలీపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా వెళ్తున్న సందర్భముగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు పలికారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయములో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ గా సమర్ధవంతంగా విధులను నిర్వహించిన మనుచౌదరిని శాలువాతో సన్మానించారు.