మొయినాబాద్ శివారులోని కేతుపల్లి గ్రామంలో యువ న్యాయవాది స్వప్నపై జరిగిన దాడిని నిరసిస్తూ, దుబ్బాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ సెక్రెటరీ చిటుకుల అశోక్ మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులపై భవిష్యత్తులో దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.