సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్దెల మల్లయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను తగలబెడుతుండగా, పొగ తీవ్రతకు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. అదుపుతప్పిన మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.