సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధి జగదేవపూర్ మండలంలోని గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. చాట్లపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆరుగాలం పండించిన పంటను కొనేవారు లేరని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, దర్గయ్య, నర్సింలు తదితర రైతులు పాల్గొన్నారు.