సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించి, మూడో రోజు రథోత్సవంతో ఘనంగా ముగించారు. సంప్రదాయ పూజలు, ప్రత్యేక అలంకరణల మధ్య స్వామివారిని రథంపై ప్రతిష్టించి గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఆలయ నిర్వాహకులు మన్నే ప్రకాష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్న దాతలకు, ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.