హుస్నాబాద్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు వెనుతిరుగుతున్నారు. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో డీజిల్ దొరక్క హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.