సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మరో 3 మృతదేహాల వివరాలను గుర్తించారు. ఇద్దరు బిహార్, ఒకరిని ఒడిశా కార్మికులుగా అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిగాచీ బాధితుల కోసం ఘటనాస్థలికి బిహార్ నేతలు చేరుకున్నారు. దీంతో భారీ పేలుడులో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 40కి పెరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.