సంగారెడ్డి మండలం ఇరిగిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్తో లైన్మెన్ రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గ్రామ శివారులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.