సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి, సోమవారం మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి మొత్తం 1,06,000 రూపాయల జరిమానా విధించారు. పట్టణంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. వీరిలో ఒకరికి 10 రోజుల జైలు శిక్ష కూడా విధించారు. ఈ సంఘటన పట్టణంలో వాహనదారుల్లో భయాందోళనలు సృష్టించింది.