సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి శివారులో గురువారం లక్ష్మారెడ్డి (34) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. నిజాంపేట మండలం నాగధర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.