వైద్యుల ప్రకారం, కట్ల పాము అత్యంత ప్రమాదకరమైనది మరియు నిశ్శబ్దంగా దాడి చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట సంచరించే ఈ పాము కరిచినప్పుడు నొప్పి, వాపు ఉండదు. దీని విషం నరాల పనితీరును స్తంభింపజేసి, శ్వాస వ్యవస్థను ఆగిపోయేలా చేస్తుంది. కడుపు నొప్పి, కనురెప్పలు వాలిపోవడం, మాట పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నేలపై పడుకోకుండా, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, యాంటీ స్నేక్ వెనమ్ తో ప్రాణాలు కాపాడుకోవాలి. అవగాహనతో ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.