రూ.1.10 కోట్ల విలువైన వెండి బిస్కెట్లు సీజ్ (వీడియో)

కారులో తరలిస్తున్న 110 వెండి బిస్కెట్లను ఒడిశా ఆబ్కారీ అధికారులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును రెంగాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తనిఖీ చేశారు. కారు సీక్రెట్ అరలో వెండి బిస్కెట్లు గుర్తించారు. ముంబై నుంచి రాంచీకి ఈ వెండి బిస్కెట్లను తరలిస్తున్నట్లు జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్ అసిత్ మల్లిక్ తెలిపారు. దీని విలువ రూ.1.10 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్