బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.600 పెరిగి రూ.1,19,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.660 పెరిగి రూ.1,30,480 పలుకుతోంది. వెండి ధర మాత్రం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.4,000 పెరగడంతో రూ.1,96,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.