విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సృజన్రెడ్డి శుక్రవారం తెలిపారు. కేఎన్ఆర్ భగత్నగర్కు చెందిన మెహర్తేజను హైదరాబాద్ కు చెందిన రాథోడ్ బ్యాంకాక్లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్ ఫోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు.