సింగరేణి సంస్థ ఆర్జీ-3 ఏరియాలోని సెంటినరీకాలనీ నర్సరీని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సందర్శించారు. అదనపు కలెక్టర్ ను ఏరియా జనరల్ మేనేజర్ సుధాకర్ రావు శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సరీ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్రీ డీజీఎం కర్ణ పాల్గొన్నారు.