ప్రజలకు న్యాయంపై అవగాహన పెంచి, సులభంగా న్యాయం అందించే లక్ష్యంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి. నీరజ ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి పి. లక్ష్మణాచారి సమన్వయంతో ఈ సదస్సు జరిగింది. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.