రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా అవగాహన శిబిరం నిర్వహించబడుతుంది.