రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ధర్మ టీచర్ యూనియన్, తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన విద్యా విధాన పత్రం 2026పై స్పందించింది. యూనియన్ జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు గౌరవప్రదమైన విద్యను కోరుకుంటున్నారని తెలిపారు. మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ బడుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఆయన సూచించారు.