రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు అందజేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.