రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో వచ్చే నెల ఏప్రిల్ 7వ తేదీన 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుంది. రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్, పరిసర జిల్లాల రైతులు అర్హులు. 1.5 నుంచి 5 ఎకరాల సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.