రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలపై అవగాహన కల్పించాలని, అత్యధికంగా ప్రసవాలు జరిగేలా, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అత్యవసరమైతేనే సీ సెక్షన్ చేయాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, నవజాత శిశువులు, తల్లుల మరణాలు జిల్లాలో జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఆశ కార్యకర్తలు గర్భిణులతో నిత్యం సంప్రదింపులు జరపాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు పాల్గొన్నారు.