రాజన్న సిరిసిల్ల: 60 లక్షల విలువైన 65 మొబైల్స్ యజమానులకు అప్పగింత

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్‌ఫోన్‌ రికవరీ మేళాలో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 65 పోయిన/దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు యజమానులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 2183 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో గుర్తించి బాధితులకు తిరిగి అందించారు. జిల్లాలో ఫోన్ రికవరీ రేటు 83%గా ఉన్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నవారు లేదా దొంగిలించబడినవారు వెంటనే CEIR పోర్టల్లో ఫోన్‌ను బ్లాక్ చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. దొంగిలించిన ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్