శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఉన్న వారిపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారి కార్యకలాపాలు, కదలికలపై ఆరా తీసి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ మహేష్ బి. గీతే సూచించారు. అసాంఘిక కార్యకలాపాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలిగే వారి షీట్లను తొలగిస్తామని, పోలీస్ స్టేషన్ కు హాజరు కాని వారిని బైండోవర్ చేస్తామని తెలిపారు.