జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సౌజన్య, వడ్డెర కుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.