యూపీలోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వికాస్ దూబే (24) అనే యువకుడిని గత నెల 2న ఓ పాము కాటు వేసింది. 40 రోజుల్లో ఏకంగా ఏడు సార్లు పాము తనని కాటు వేసింది. ఇదిలా ఉండగా వికాస్ దుబేను ప్రతి సారి శనివారం మాత్రమే కరుస్తుండటం గమనార్హం. దీనిపై బాధితుడు పాము కాటుకు వైద్యం చేయించడానికి చాలా డబ్బు ఖర్చు చేశానని ఆర్ధిక సాయం అందించాలని స్థానిక కలెక్టర్ కార్యాలయాన్ని అభ్యర్ధించాడు.