కర్ణాటక బెళగావి జిల్లాలోని ఖానాపూర్ తాలూకా ఇద్దిలుహోండ గ్రామంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను వేగంగా నడుపుతుండగా నియంత్రణ కోల్పోవడంతో యాక్సిడెంట్ అయ్యి ఒక సైనికుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మరణించిన సైనికుడుని సౌరభ్ ద్రౌపదకర్ (28)గా గుర్తించారు. ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారు.