హైదరాబాద్ కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. సికింద్రాబాద్లోని లాలాగూడలో ఉంటున్న అరెల్లి మొగిలి (45) మద్యానికి బానిస అయ్యాడు. దీని వల్ల కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాలు సైతం వారి ఫ్యామిలీలో ఉన్నాయి. ఇక తండ్రి తీరుతో విసుగెత్తి, ఆయనను చంపాలని కొడుకు సాయి డిసైడ్ అయ్యాడు. ఈసీఐఎల్ చౌరస్తాలో తండ్రిని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే 12 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు.