2025లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న అతని భార్య సోనమ్కు మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘువంశీ కుటుంబసభ్యులు, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సోనమ్ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆమెకు ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.