టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 2.3 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఇద్దరు కీలక బ్యాటర్లను ఔట్ చేశారు. హెండ్రిక్స్ను బుమ్రా బౌల్డ్ చేయగా, కెప్టెన్ మార్క్రమ్ను అర్ష్దీప్ పెవిలియన్కు పంపించారు. దీంతో ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతూ బ్యాటింగ్ చేస్తున్నారు.