TG: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాను విద్యార్థినులు గుర్తించారు. హాస్టల్ను నడుపుతున్న మహేశ్వర్ అనే వ్యక్తి ఫోన్ చార్జర్లో కెమెరా పెట్టారని మహిళలు అమీన్ పూర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. నిందితున్ని PSకు తీసుకువచ్చి అధికారులు, స్పై కెమెరాలోని పలు చిప్స్ను పరిశీలిస్తున్నారు.