వడగాల్పులను విపత్తుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. అలాగే, వడదెబ్బతో మరణించిన వ్యక్తి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని వెల్లడించింది. ఇప్పటి వరకు రూ.50 వేలు ఇస్తుండగా, ఆ పరిహారాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్