దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28కు సెన్సెక్స్ 72 పాయింట్లు పెరిగి 82,596 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 25,172 వద్ద ట్రేడయ్యాయి. ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉండగా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, టెక్మహీంద్రా, HCL టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి మారకం విలువ 85.46గా ఉంది.