దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. గత వారం నుంచి వరుసగా నష్టాలు చవిచూస్తున్న సూచీలు సోమవారం కూడా నష్టాల బాట పట్టాయి. ఈ ఒక్క రోజే రూ. 4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454 దగ్గర ముగియగా నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 22,553 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 86.70గా ఉంది.