హైదరాబాద్లోని హయత్నగర్లో వీధికుక్కల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీ నుంచి అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన, గాయపడ్డ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, కమిషనర్ వెళ్లి బాలుడిని పరామర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకోవాలని సూచిస్తూ, వీధికుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.