మధ్యప్రదేశ్లోని శివ్పురిలో ఒక వీధి కుక్క దాడిలో దాదాపు 60 మంది గాయపడ్డారు. మహిళలు, పిల్లలతో సహా పలువురిని ఆ కుక్క కరిచింది. గాయపడిన వారందరికీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించి, యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే కుక్కల గురించి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం డిమాండ్ చేస్తున్నారు.