రాజస్థాన్లో ఓ విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడి తిరిగి లెక్చరర్పైనే దాడికి తెగబడ్డాడు. జోధ్పూర్లోని ఓ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా లెక్చరర్ పట్టుకొని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్, లెక్చరర్ చెంపపై కొట్టాడు. చివరికి ఇతర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.