రాజస్థాన్ జైపూర్లో దారుణం జరిగింది. ఓ స్కూల్ ఐదవ అంతస్తు నుండి దూకి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా (12) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చేలోపు పాఠశాల సిబ్బంది ఆ ప్రాంతాన్ని, రక్తపు మరకలను శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. CCTV ఫుటేజ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.