హర్యానా హిసార్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జుట్టు కత్తిరించుకోలేదని ప్రిన్సిపల్ తిట్టినందుకు మైనర్ విద్యార్థులు ఆయనను దారుణంగా పొడిచి చంపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్తార్ మెమోరియల్ స్కూల్కు చెందిన విద్యార్థులను సరిగ్గా జట్టు కత్తిరించుకుని రావాలని ప్రిన్సిపల్ ఆదేశించారు. కానీ వారు మాట వినకపోవడంతో ప్రిన్సిపల్ మందలించాడు. దీంతో ప్రిన్సిపల్పై కోపం పెంచుకున్న విద్యార్థులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.