ఢిల్లీలో డేంజర్ స్థాయిలో ఎండలు.. 15 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వేడిగాలుల కారణంగా గత 72 గంటల్లో ఢిల్లీలో 15 మంది చనిపోయారు. నోయిడా, ఢిల్లీలో మొత్తం 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వేడిగాలుల కారణంగా దాదాపు 36 మందిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. వడదెబ్బల కారణంగా 12 మందికి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడంతో రెడ్ అలర్ట్ ను విధించారు.

సంబంధిత పోస్ట్