విదేశాలపై విధించిన టారిఫ్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు టారిఫ్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. సుంకాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని విమర్శిస్తూ, తాను విధించిన టారిఫ్ల ద్వారా వందల బిలియన్ డాలర్లు సృష్టించానని తెలిపారు.