పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టు లాయర్ మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం గురించి స్పీకర్ వద్దకు వెళ్లాలని సుప్రీం అభిప్రాయపడిందన్నారు. సభలో ప్రొసీడింగ్స్పై స్పీకర్ ట్రైబ్యునల్గా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని తెలిపిందన్నారు. ఈ మేరకు స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొందని లాయర్ తెలిపారు.