సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలో మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుజూర్ నగర్ నుండి మట్టపల్లికి ఆర్టీసీ బస్సులు లేకపోవడం, బైక్లకు పెట్రోల్ దొరకకపోవడం, ఆటోలు అధిక ఛార్జీలు వసూలు చేయడం వంటి సమస్యలతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. రవాణా సదుపాయాలు కల్పించడంలో దేవస్థానం పాలకవర్గం విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.