సిట్ నోటీసుల పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇబ్బంది పెడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. గురువారం కోదాడ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసారు. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ , హిట్లర్ పాలనలా ఉందన్నారు. కేసీఆర్పై కక్షసాధింపు చర్యలు మానాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.