కోదాడలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026 ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్లకు రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు రూ. 5 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ ఆయనను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరి సమిష్టి కృషి అవసరమని రామారావు అన్నారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు.